కాళేశ్వరం: పవిత్ర పూణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తిశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం భక్తుల సందడి మొదలైంది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్ వంటి నగరాల నుంచే గాక వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చారు. తెల్లవారు జామునుంచే త్రీవేణి సంగమం గోదావరి తీరంలో భక్తులు స్నానాలు చేసి, దీపాలు వదిలి, సైకత లింగలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో అర్చకులు శని, కాలసర్పదోష నివారణ పూజలు చేశారు. కాళేశ్వర, ముక్తిశ్వర స్వామి వారికి వివిధ ప్రాంతల నుంచి వచ్చిన భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుభనంద దేవి (పారతి అమ్మవారు)ఆలయంలో అర్చకులు ప్రశాంత్ శర్మ కుంకుమ అర్చనలుజరిపా