జయశంకర్ భూపాలపల్లి : టీఆర్ఎస్ పాలనలోనే సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్య గండ్ర మాట్లాడుతూ..కరోనా కష్ట కాలంలో కూడా నిరంతరాయంగా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని ప్రశంసిచారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరమన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.