కాళేశ్వరం : పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం దేవస్థానంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కాళేశ్వరంలోని శుభనంధ (పార్వతీ) దేవి, శ్రీమహ సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం ఉదయం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణ ల మధ్య దుర్గాదేవి మాతను ప్రతిష్టించి పలు ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజున దుర్గాదేవి శైలపుత్రిగా దర్శనమివ్వడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజించారు.
రెండో రోజు శుక్రవారం దుర్గాదేవి బ్రహ్మచారిణి అవతారంగా భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. దుర్గాదేవి సన్నిధిలో అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.