వెంకటాపురం(నూగూరు)/టేకుమట్ల,మార్చి 28: మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతీ అలివేలు మంగ వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. దేవాదాయశాఖ అధికారులు, ఆలయ అనువంశిక ధర్మకర్త రాజారాఘవరాజు రంగ రాజు ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, మంగపేట మండలాల నుంచే కాకుండా భద్రాద్రి కొత్తగుడెం జిల్లా చర్ల, దుమ్ముగుడెం, భద్రాచలం, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు లడ్డూలు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఅర్ఎస్ ములుగు జిల్లా నాయకులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు (లక్ష్మణబాబు), ప్రదీప్రావు, వెంకటాపురం జడ్పీటీసీ పాయంరమణ, నూగూరు ఏఎంసీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంపారాంబాబు, కార్యదర్శి పిల్లారసెట్టి మురళి, అధికారప్రతినిధి డర్రా దామోదర్, ఉపాధ్యక్షుడుశ్రీను తదితరులు పాల్గొన్నారు. టేకుమట్ల మండలంలోని రాఘవాపూర్ గుట్టపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి, ఆశిరెడ్డిపల్లిలోని వేంకటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆశిరెడ్డిపల్లి దేవస్థానం వద్ద ఎంపీటీసీ గందం వజ్రసారయ్య సొంత ఖర్చులతో 2000 మంది భక్తులకు అన్నదానం చేశారు. జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, సర్పంచ్లు నందికొండ శోభారాణీ మహిపాల్రెడ్డి, వెలిశెట్టి స్వర్ణలతా సురేశ్, ఆలయ చైర్మన్ ఓదెలు, సరోత్తంరెడ్డి ల్గొన్నారు.