జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు మండలి విప్ భానుప్రసాద్రావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేశారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత పాల్గొన్నారు.
ములుగు జిల్లా కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్రావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేశారు. వేడుకల్లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన అవతరణ వేడుకలకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జులైవాడలోని అర్బన్ కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని దాస్యం పేర్కొన్నారు. వేడుకల్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
వరంగల్ రూరల్ జిలా కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఏడేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం దృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విశేష కృషి ఫలితంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. ఇక్కడ పరకాల, నర్సంపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎంపీ బండా ప్రకాశ్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ మహబూబాబాద్ జిల్లా అంచెలంచెలుగా ప్రగతి సాధిస్తున్నదని మంత్రి చెప్పారు. జాతీయ రహదారితో పాటు మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వేడుకల్లో కలెక్టర్ వీపీ.గౌతమ్, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యే శంకర్నాయక్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పాల్గొన్నారు. నెల్లికుదురు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీ మాలోత్ కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు.