కృష్ణకాలనీ, జూన్ 2: ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలం, సకల జనుల సమ్మె, అకుంఠిత దీక్షలతో పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, టీఆర్ఎస్ అర్బన్ కార్యాలయం(ఇందిరాభవన్)లో ఎమ్మెల్యే గండ్ర జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భా వం అనంతరం మొట్టమొదటిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టించి తెలంగాణ ముఖచిత్రాన్నే మార్చిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టుతో రైతులకు సాగు, తాగు నీరం దించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. అంతేకాకుండా రైతుబంధు, రైతు బీమా వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారన్నారు.
పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే ఇతర రాష్ర్టాల కంటే ముందుం చారని అన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిప ల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరి బాబు, ఎంపీపీ మందల లావణ్య, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, మండల అధ్యక్షు డు మందల రవీందర్రెడ్డి, అర్బన్ ప్రధాన కార్యదర్శి తాటి అశోక్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్, కౌన్సిలర్లు, హనుమా న్ దేవాలయ చైర్మన్ కుమార్రెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్క ర్, జయశంకర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపానికి శాసనమండలి విప్ భానుప్రసాద్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ కూరా కుల స్వర్ణలత, ఏఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ ఎండీ ఇక్బాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంత రం అమరువీరుల త్యాగాలను స్మరించుకున్నారు.