ప్రజలు భాగస్వాములు కావాలి
అధికారులు, ప్రజాప్రతినిధుల పిలుపు
కరోనా నియంత్రణలో భాగంగా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుధ్య పనులు వేగవంతం చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో జీపీ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లడంతోపాటు వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
దుగ్గొండి, మే11 : కరోనా నివారణ చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని రేఖంపల్లి పంచాయతీ కార్యదర్శి వేముల అశోక్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రేఖంపల్లిలో సర్పంచ్ ఇమ్మడి యుగేందర్ ఆధ్వర్యంలో జీపీ సిబ్బందితో మురుగు కాల్వల్లో, వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ను చల్లించారు. అనంతరం స్వచ్ఛభారత్ కార్యక్రమా న్ని నిర్వహించి ్రడ్రైనేజీల్లోని చెత్తాచెదారాన్ని తొలగించారు. అశోక్రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశుభత్రతో పరిసరాల పరిశ్రుభతపై దృష్టి సారించాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండలంలోని అక్కల్చెడ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ తూఠఙ పావనీరమేశ్ ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది పారిశుధ్య పనులు నిర్వహించారు. డ్రైనేజీల్లోని పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి మురుగునీరు నిల్వ లేకుండా చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్య పనులు వేగవంతం చేస్తున్నామ న్నారు. జీపీకి చెందిన ట్రాక్టర్ వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేరుగా వేయాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సత్యనారాయణ, ఉప సర్పంచ్ బానోతు వీరన్న, వార్డు సభ్యులు ఆకుల అశోక్, ఈర్ల వనిత, ఇస్లావత్ స్వామి, భూక్యా రవి, కరెడ్ల రాజు, జీపీ సిబ్బంది, గ్రామ స్తులు పాల్గొన్నారు.
శాయంపేటలో..
శాయంపేట : మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య పనులపై దృష్టి పెట్టాలని ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, ఎంపీవో బుర్ర రంజిత్కుమార్ అన్నారు. మైలారం, పత్తిపాక గ్రామాల ను శుక్రవారం వారు సందర్శించి పారిశుధ్య పనులు, డ్రైనేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమైనందున శానిటేషన్ పనుల్లో లోపం రావొద్దని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లు, డ్రైనేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలన్నారు. కరోనా నియంత్రణకు గ్రామాల్లో శానిటేషన్ పనులు ముమ్మరం చేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆలీ, సిబ్బంది ఉన్నారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి : వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో మండలంలోని మేడపల్లిలో శుక్రవారం స్థానిక సర్పంచ్ అజ్మీరా తిరుపతి డైనేజీలను శుభ్రం చేయించారు. మురుగు కాల్వల్లో పేరుకుపోయి చెత్తచెదారాన్ని తొలగించారు. సర్పంచ్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షానికి నీరు ఇళ్లలోకి రావడంతో డైనేజీల్లో పేరుకుపోయిన మట్టిని తొలంగించామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రావణ్, మల్టీపర్పస్ వర్కర్స్ పాల్గొన్నారు.