పరకాల, మే 30: కరోనా మహమ్మా రిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల పట్టణంలోని 13వ వార్డు కౌన్సిలర్ శనిగరపు రజినీనవీన్ అన్నారు. కరోనా నివారణకు ఆదివారం వార్డు పరిధిలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు వారు పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు వైద్యుల సూచనలు పాటించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దన్నారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సహకారంతో వార్డు పరిధిలో కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టామని వివరించారు. ప్రజలు కరోనా నిబంధనలను పాటించి వైరస్ నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంజిత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.