మేడారంలో ఏర్పాట్లను వేగవంతం చేయాలి
ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య
అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
రామప్ప ఆలయ సందర్శన
యునెస్కో గుర్తింపునకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపు
ములుగుటౌన్, మే 24 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క- సారలమ్మ మేడారం మహాజాతర నిర్వహణకు అధికారులు సంసిద్ధులై ఉండాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 19వ వరకు జరిగే జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2020లో నిర్వహించిన జాతరకు వచ్చి న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆర్అండ్బీ, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖలు చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేసి నివేదిక పంపించాలని ఆదేశించారు. అనంతరం కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో హన్మంతు కే జం డగే, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ఆర్అండ్బీ ఈఈ వెంకయ్య, ఇరిగేషన్ ఈఈ మాణిక్యరావు, దేవాదాయ శాఖ అధికారి రాజేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యునెస్కో గుర్తింపునకు కృషి..
వెంకటాపూర్ : పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని కలెక్టర్ కృష్ణ ఆదిత్య కేంద్ర పురావస్తుశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. రామ ప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు రావాలంటే ప్రధా న ఆలయంతో పాటు పరిసర ఆలయాలను కూడా అభివృద్ధి చేయాలని, వాటి ని తమకు అప్పగించాలని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు కలెక్టర్కు ఇటీవల నివేదిక సమర్పించారు. దీంతో కలెక్టర్ వారితో కలిసి ఆలయాన్ని పరిశీలించారు. ప్రతి ఆలయం చుట్టూ హద్దులు ఏర్పాటు చేసి ఆలయాలకు 40 అడుగుల మేర రహదారి తీసి ఇవ్వాలని తహసీల్దార్కు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఆల య సమీపంలో ఉన్న షాపులను మరో చోటికి తరలించాలన్నారు. అవసరమైతే షాపుల యజమానులకు ప్రభు త్వం ద్వారా కొంత ఫండ్ వచ్చేవిధంగా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ స్మితాకుమారి, ఉమ్మడి జిల్లా అధికారి మల్లేశం, తహసీల్దార్ మంజుల, ఎస్సై రమేశ్, డీఐ రాజనర్సయ్య, సర్పంచ్ డోలి రజిత, ఆర్ఐ రాజకుమారి, రామప్ప పురావస్తుశాఖ కో ఆర్డినేటర్ కుమార్, వీఆర్వో రమేశ్, కార్యదర్శి నిరంజన్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.