నెక్కొండ, మే 23 : కరోనా బాధితులను ఐసొలేషన్ కేంద్రాలకు తరలించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని నర్సంపేట ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నెక్కొండ, అలంకానిపేట పీహెచ్సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ పరీక్షలు, పాజిటివ్ వచ్చిన వారికి అందిస్తున్న మెడికిల్ కిట్ల పంపిణీ వివరాలు తెలుసుకుని వైద్యులు, సిబ్బందికి ఆయన సూచనలు చేశారు. కరోనా సోకిన వారు 15 రోజులు హోం ఐసొలేషన్లో ఉండేలా పేషెంట్లకు సూచనలివ్వాలన్నారు. ఇంటి వద్ద వసతులు లేనివారిని నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసొలేషన్ క్యాంప్నకు తరలించాలని సూచించారు. అనంతరం వెంకటాపురంలో ఇంటింటి జ్వర సర్వేను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్రావు, సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్య, అలంకానిపేట సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కర్పూరపు సంపత్కుమార్, మండల నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, బక్కి కుమారస్వామి, సారంగపాణి, భిక్షపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.