కరోనాతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. వైరస్ నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
వెంకటాపూర్లో వృద్ధురాలు …
వెంకటాపూర్, ఏప్రిల్ 22 : మండలంలోని రామాంజపూర్ గ్రామానికి చెందిన కురుమశెట్టి లక్ష్మి (65) కరోనాతో మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురవగా చికిత్స నిమిత్తం వరంగల్లోని ఓ ప్రవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. చికిత్స పొందుతున్న ఆమె గురువారం మృతి చెందింది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావడానికి గ్రామస్తులు అభ్యంతరం చెప్పడంతో ఊరి చివర అంత్యక్రియలు నిర్వహించారు.
కుంటపల్లిలో మహిళ…
సంగెం : కరోనాతో ఓ మహిళ మృతి చెందింది. సర్పంచ్ కావటి వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకా రం… మండలంలోని కుంటపల్లి గ్రామానికి చెందిన రాయపురం సారమ్మ (65) తీర్థయాత్రలకు వెళ్లి ఇటీవల గ్రామానికి వచ్చింది. ఒంట్లో నీరసంగా ఉండడంతో ఐదు రోజుల క్రితం సంగెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు వైద్య సిబ్బంది మందులు అందజేసి ఇంట్లోనే ఉండాలని సూచించారు. హోం క్వారంటైన్లో ఉన్న ఆమె గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. విష యం తెలుసుకున్న సర్పంచ్ వెంకటయ్య పంచాయతీ సిబ్బంది, ట్రాక్టర్ను మృతురాలి ఇంటికి పంపించారు. మృతురాలి సోదరులు పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని గ్రామపంచాయతీ ట్రాక్టర్లో శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. పంచాయతీ కార్మికులు మృతురాలి ఇంట్లో, పరిసర ప్రాంతా ల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
కేసముద్రంలో వృద్ధురాలు…
కేసముద్రం : మండలంలోని పెనుగొండ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది. డాక్టర్ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో హోం క్వారంటైన్లో ఉంటోంది. గురువారం ఆమె పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు.
బలపాలలో వ్యక్తి…
కురవి : కరోనాతో దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని బలపాల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నెల్లూరి మాధవరావు(55) కొద్ది రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ దవాఖానలో చేరాడు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఖమ్మం అన్నం ఫౌండేష న్ నిర్వాహకుల సహకారంతో సర్పంచ్ ముండ్ల ప్రమీ ల, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ ముండ్ల రమేశ్, కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
బీమదేవరపల్లిలో వృద్ధురాలు..
భీమదేవరపల్లి, ఏప్రిల్ 22 : కరోనాతో వృద్ధురాలు మృతిచెందిన సంఘటన ముల్కనూరులో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సుంకరపెళ్లి లక్ష్మి (62) నాలుగు రోజుల క్రితం ములుకనూరు ప్రభుత్వ దవాఖానలో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. హోం క్వారంటైన్లో ఉన్న ఆమె గురువా రం మృతి చెందింది. ముల్కనూరు ఎస్సై రాజ్కుమార్ ఆదేశాల మేరకు ఏఎస్సై గోవర్ధన్, ముల్కనూరు ఎంపీటీసీ బొల్లంపల్లి రమేశ్, వార్డు సభ్యుడు అలుగు సంప త్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
పోస్టాఫీసు సేవలకు కేంద్రం గైడ్లైన్స్..
vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి