హన్మకొండ, ఏఫ్రిల్ 22: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగరేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. గురువారం సాయం త్రం హన్మకొండలోని హరి త కాకతీయ హోటల్లో వరంగల్ మహానగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ల ఇన్చార్జులుగా పనిచేస్తున్న పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,సమన్వయ కమిటీ సభ్యులతో మంత్రి సమీక్షించారు. ఎన్నికల్లో వ్యూహరచనపై చర్చించారు. ప్రచారంలో ఏఏ అంశాలను ప్రస్తావించాలని, సభలు, సమావేశాలు నిర్వహించాల్సిన సందర్భాలు, సమన్వయ కమిటీ సభ్యులను ఎక్కడెక్కడ వినియోగించుకోవాలి, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు ఎలా తీసుకెళ్లి వివరించాలనే అంశాలపై మంత్రి దిశా నిర్దేశం చేశారు. వారం, పది రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడి గ్రేటర్పై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఏటా బడ్డెట్లో నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయన్నారు.
ప్రచారంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ప్రచారానికకి సంబంధించి పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి సూచించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఎన్నికలను ఈజీగా తీసుకోవద్దని నాయకులను హెచ్చరించారు. ప్రతి కార్యకర్త గులాబీ సైనుకుల్లా పనిచేయాలన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రచారంలో పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. సమావేశంలో స్త్రీశిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎంపీలు డాక్టర్ బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రాజేశ్వర్రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, మాధవరం కృష్ణారావు, ఒడితెల సతీశ్కుమార్, శంకర్నాయక్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, రైతు విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
చుట్టాలబ్బాయి దర్శకుడితో ఆది సాయికుమార్ మూవీ
కాళేశ్వరం జలాలకు పూజలు చేసిన స్పీకర్ పోచారం, మంత్రి వేముల