ఖాతాల్లో రూ. 2 వేలు జమ
పలుచోట్ల బియ్యం పంపిణీ ప్రారంభం
జన హృదయ నేత సీఎం కేసీఆర్
ఎంపీపీలు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, పలువురు నాయకులు
చెన్నారావుపేట, ఏప్రిల్ 21 : మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు బుధవారం 25 కిలోల చొప్పున ఎం పీపీ బదావత్ విజేందర్, ఎంఈవో రత్నమాల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం 25 కేజీల బియ్యంతో పాటు రూ.2 వేలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన జన హృదయనేత సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. మండలంలో మొత్తం 165 మందికిగాను 104 మందికి బియ్యం పంపిణీ, నగదు జమ అయ్యాయని.. మిగతా 61 మంది ఐప్లె చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీచర్లు గోదాదేవి, కృష్ణమోహన్, రేషన్ డీలర్ ఆకుల మనోహర్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ అల్లం స్వప్న, కంప్యూటర్ ఆపరేటర్ మంద అశోక్, సీఆర్పీలు బాలు, శిల్ప, శ్రీనివాసచారి, మంద శంకర్, మెసెంజర్ నర్మెట యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
వర్ధన్నపేట : ఆపదకాలంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు చేయూతనిస్తున్న సీఎం కేసీఆర్ చిత్రపటానికి మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు సుంకరి సాంబయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి మాట్లాడుతూ.. కరోనాతో ఏడాదిగా ప్రైవేటు పాఠశాలలు నడవక యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు ఉపాధ్యాయుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. దీన్ని గుర్తించి సీఎం కేసీఆర్ చేయూతనివ్వడంతో ఉపాధ్యాయుల కుటుంబాలు సం తోషం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆబర్ల సాయిలు, గుర్రం యాకయ్య, మైదం అనిల్, కందగట్ల శివ, సమ్మెట సదాశివుడు, కోదాటి అరవింద్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
శాయంపేటలో..
శాయంపేట : మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలో ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం మానవతాదృక్పథంతో అందించిన ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ అబ్బు ప్రకాశ్రెడ్డి, ఎంపీటీసీ మాచర్ల మంగమ్మ ప్రారంభించారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ అమ్మ భద్రమ్మ, ప్రైవేట్ టీచర్లు తిరుపతి, విక్రం, శివ, సుమన్, అశోక్, జాగృతి యువత రాష్ట్ర నాయకుడు అమ్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు.