కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఏర్పాట్లు
ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సైతం..
మరింత మెరుగైన సేవల కోసం అధికారుల చర్యలు
వరంగల్ చౌరస్తా, మే 19: కరోనా బాధితులకు, వారి అటెండెంట్లకు, ప్రజలకు ఎంజీఎం దవాఖాన సమాచారా న్ని నిత్యం అందుబాటులో ఉంచడానికి కొవిడ్ 19 కమాండ్ కంట్రోల్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగం 24 గంటలు అక్కడ చికిత్స పొం దుతున్న వారి వివరాలను పర్యవేక్షించడంతోపాటు ఖాళీ, ఆక్సిజన్ పడకల వివరాలు, వెంటిలేటర్ల వినియోగం సంబంధిత శాఖ అధికారులకు అందిస్తుంది. ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష నిర్వహించి కరోనా వైద్యసేవలను మరింత మెరుగుపరచడానికి చర్యలు చేప ట్టాలని అర్బన్ జిల్లా కలె క్టర్ ఆర్జీ హన్మంతు, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వీ చంద్రశేఖర్ను ఆదేశించడం తో అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఎంజీఎంలో చికిత్స పొందుతున్న వారి కుటుంబసభ్యుల ఆరోగ్యస్థితిని తెలుసుకోవడానికి కొవిడ్ వార్డుకు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో వారు వైరస్ వ్యాప్తికి వారు కారణమ య్యారని అధికారులు గుర్తించారు. కొన్ని రోజులుగా కొవి డ్ వార్డుపై ఎంజీఎం అధికారుల పర్యవేక్షణ తగ్గిపోవడంతో పలు అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలను సైతం చెక్ పెట్టొచ్చే అవకాశముందటంటున్నారు. వీట న్నింటిని నివారించడానికి కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంట ర్ ఏర్పాటు చేయబోతున్నారు.
ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు..
సుమారు వెయ్యి పడకల పైచిలుకు పడకల సామర్థ్ధ్యాన్ని మించిన సేవలు అందిస్తున్న ఎంజీఎంలో సమాచారం లోపం వల్ల జరుగుతున్న ఇబ్బందులను నివారించడానికి అధికారులు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయ నున్నారు. పీఆర్వోల సంఖ్యను పెంచి అత్యవసర పరిస్థితు ల్లో సమాచారాన్ని సరైన సమయంలో అందించడం, స్వీక రించేలా చర్యలు తీసుకుంటున్నారు. వారికి రోస్టర్ విధా నంలో విధులు కేటాయించి విపత్కర పరిస్థితులను ఎదు ర్కోవడానికి చర్యలు చేపడుతున్నారు.