కరోనా బాధితులకు అన్నీ తానైన సర్కారు
వైద్యం కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు
ఇటు పరీక్షలు.. ఆ వెంటే మందుల పంపిణీ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సదుపాయాలు
171 ఐసొలేషన్ కేంద్రాల్లో రోగులకు చికిత్స
అందుబాటులో 1985 ఆక్సిజన్ బెడ్స్
వరంగల్, మే 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా సెకండ్ వేవ్ అందరినీ ఆందోళన కలిగిస్తున్న వేళ వైరస్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘లాక్డౌన్’తో కట్టుదిట్ట మైన చర్యలు తీసుకుంటూనే రోగులకు మెరుగైన సేవలంది స్తోంది. వైరస్ బారిన పడిన వారికి అవసరమైన అన్ని రకా ల వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. ఇంటింటా జ్వర సర్వే చేస్తూ లక్షణాలున్న వారికి వెంటనే మందులను అంది స్తోంది. తీవ్రత ఉన్న వారిని గుర్తించి వారికి అవసరమైన వైద్య సేవలందిస్తోంది. స్థానిక పీహెచ్సీలతో సమన్వయం చేసి ప్రతి బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసింది. చికిత్స అవసరమైన వారు ఉంటే వారిని వెంటనే హాస్పిటళ్లకు తరలిస్తోంది. తీవ్రత ఉన్న వారికి ఇచ్చే మందులను, ఇంజెక్షన్లను సమ కూర్చుతోంది. అలాగే ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఎప్పటి కప్పుడు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, ఆక్సిజన్ నిల్వలను పర్యవేక్షిస్తూ అవసరమైన మేరకు సమకూర్చుతోంది.
కరోనా వైరస్ బారిన పడి తీవ్రమైన సమస్యతో ఉన్న వారికి అందించే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేస్తోంది. ఎంజీఎం దవాఖానతోపాటు ప్రైవేట్ హాస్పిటళ్లలో చేరిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కువ మందికి టెస్టులు నిర్వహించడంతోపాటు అవసర మైన ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందించడంలో పక్కాగా పనిచేస్తోంది. ఆరు జిల్లాల్లో కలిపి ప్రభుత్వం ఇప్పటివరకు 16.47 లక్షల టెస్టులు నిర్వహించింది. లక్షణాలున్న వా రందరికీ మందులు పంపిణీ చేసింది. అవసరమైన వారిని హాస్పిటళ్లలో చేర్చి వైద్య సేవలందిస్తోంది.
అన్ని జిల్లాల్లో పక్కాగా..
కరోనా బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రభుత్వ హాస్పిటళ్లతోపాటు ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ ఆక్సిజన్, మం దులను నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసు కుంటోంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 160 ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 1,729 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. 80 ఐసీయూ, 879 ఐసీయూ వెంటిలేటర్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. కరోనా బాధితులను గుర్తించేందుకు 395 బృందాలు పనిచే స్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో మూడు ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 33 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా సర్వే కోసం 417 బృందాలు ఏర్పాటయ్యాయి.
జనగామ జిల్లాలో రెండు ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 100 ఆక్సిజన్ బెడ్లు, 22 ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ ఉన్న ఐసీయూ బెడ్లు 10 ఉన్నాయి. 311 బృందాలు సర్వే కోసం పనిచేస్తు న్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రెండు ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 50 ఆక్సిజన్ బెడ్లు, 10 ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ ఉన్న ఐసీయూ బెడ్లు రెండు ఉన్నాయి. సర్వే కోసం 258 బృం దాలు పనిచేస్తున్నాయి. ములుగు జిల్లాలో రెండు ఐసొలేష న్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 58 ఆక్సిజన్ బెడ్లు, ఆరు ఐసీయూ బెడ్లు ఉన్నా యి. 174 బృందాలు సర్వే చేస్తున్నా యి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు ఐసొలేషన్ కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. 15 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. 399 బృందా లు సర్వే కోసం పనిచేస్తున్నాయి.