గ్రామాల్లోనే కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలు
రూ.80లక్షలతో ఐదు హెల్త్సబ్సెంటర్ల నిర్మాణం
ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియానాయక్,
జడ్పీ చైర్పర్సన్ బిందు, కలెక్టర్ గౌతమ్
బయ్యారం, జూన్10 : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ అన్నారు. గురువారం ఆమె మండలంలోని కొత్తపేట, జగ్గుతండా, గౌరారం, రామచంద్రాపురం, జగత్రావుపేట గ్రామాల్లో రూ.80 లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ల భవనాలను జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లోనే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన వైద్యం అందేది కాదని, తెలంగాణలో ప్రస్తుతం కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలు రూపుదిద్దుకున్నాయని అన్నారు.
రానున్న రోజుల్లో హెల్త్ సబ్ సెంటర్లు వెల్నెస్ సెంటర్లుగా మారుతాయని తెలిపారు. వీటిలో వైద్యులు సైతం అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం పేదలకు దోమ తెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి హరీశ్రాజ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రాజేశ్, ఎంపీపీ మౌనిక, వైస్ ఎంపీపీ గణేశ్, తహసీల్దార్ నాగభవాని, పీఏసీఎసీ చైర్మన్ మధుకర్రెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారాయణ, సర్పంచ్లు మమత, రమేశ్, ఎంపీడీవో చలపతిరావు, ఎంపీటీసీలు కుమారి, శైలజరెడ్డి, ఉపేంద్ర, వైద్యాధికారులు రాజ్కుమార్, రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.