నేటి నుంచి కొనుగోళ్లు ఉండవు
డీఆర్డీవో సంపత్రావు
శాయంపేట, జూన్ 10: కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సంపత్రావు అన్నారు. శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ఉండవని స్పష్టం చేశారు. మండలంలోని పత్తిపాక, కాట్రపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలతో పాటు నర్సరీలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నిల్వలపై ఆరా తీశారు. సెంటర్లలో ఉన్న ధాన్యానికి త్వరగా కాంటా పెట్టి పూర్తి చేయాలన్నారు. కాట్రపల్లిలో ఆరు వేలు, పత్తిపాకలో నాలుగు వేల ధాన్యం బస్తాలు ఉన్నట్లు తెలిపారు. సెంటర్లలో ఉన్న వడ్ల బస్తాలను పూర్తి స్థాయిలో రెండు రోజుల్లో మిల్లులకు తరలించాలని సూచించారు. అన్లోడింగ్ సమస్య ఉన్నచోట డీటీ, డీఎస్వో సమన్వయం చేసుకుంటూ పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. త్వరలో చేపట్టనున్న హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లోని మొక్కలను తరలించాలన్నారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతిరెడ్డి, ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, ఐకేపీ ఏపీఎం శ్రీధర్రెడ్డి, ఈజీఎస్ ఏపీవో అనిత, సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు.
మహిళా సంఘాలను బలోపేతం చేయాలి
ఆత్మకూరు: మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని డీఆర్డీవో సంపత్రావు అన్నారు. మండలకేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో ఐదు మండలాల ఏపీఎంలు, సీసీలతో ఆయన సమీక్షించారు. ప్రతినెల టార్గెట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకు లావాదేవీలు సక్రమంగా ఉండి అర్హత కలిగిన సంఘాలకు బ్యాంకు నుంచి రుణాలు అందజేస్తామన్నారు. అన్ని మండలాల్లో సంఘాలు ఏగ్రేడ్, బీగ్రేడ్లు ఉండాలన్నారు. ప్రతినెల సమావేశాలు నిర్వహిస్తూ సంఘాలు సక్రమంగా పని చేసేలా చూసుకోవాలన్నారు. పెద్దాపురం, అగ్రంపహాడ్ గ్రామాల్లో ఐకేపీ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిలిపివేసినట్లు తెలిపారు. సమావేశంలో ఏడీఆర్డీవో శ్రీనివాస్, డీపీఎంలు దయాకర్, అనిత, భవాని, ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట, పరకాల మండలాల ఏపీఎంలు లలితాదేవి, ఝాన్సీ, శ్రీధర్, సీసీలు చీర్ల సాంబరెడ్డి, శ్యాంసన్, మాధవి, సీసీలు పాల్గొన్నారు.