నర్సంపేట రూరల్, ఏప్రిల్ 10: గురిజాలలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి శనివారం గ్రామానికి చెందిన ఆకారపు ఉప్పలమ్మ-రామస్వామి జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ ఆకారపు నరేందర్ రూ. 10,116, వినాయక టెంట్హౌస్ యజమాని మంచిక శ్రీనివాస్, లక్నేపల్లి వార్డు సభ్యుడు కత్తి కిరణ్ రూ. 10,116, గట్టు సమ్మక్క-వీరయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి మనువడు గట్టు సంపత్-మమత రూ. 5,116 ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నీలం మల్లయ్య, గౌరవ అధ్యక్షుడు గుర్రం నర్సింగం, సర్పంచ్ గొడిశాల మమత, డైరెక్టర్లు గజ్జి రాజు, గడ్డం నర్సయ్య, గుర్రం అచ్చయ్య, గొడిశాల సంపత్, డక్క శ్రీనివాస్, గడ్డం ఆంజనేయులు పాల్గొన్నారు.
వన ప్రేమికుడికి ఆర్థిక సాయం
నెక్కొండ: మొక్కల పెంపకంపై ప్రజలను చైతన్యం చేస్తున్న మండలంలోని గుండ్రపల్లికి చెందిన వనప్రేమికుడు నల్గొండ సమ్మయ్యకు మండలకేంద్రంలోని కాసుల బ్రదర్ జువెల్లరీ వర్క్ యజమాని కాసుల రాజానారాయణచారి రూ. 5,121 ఆర్థిక సాయం అందించారు. సమ్మయ్య చేస్తున్న సేవలకు తనవంతు సాయం అందించినట్లు ఆయన తెలిపారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
నర్సంపేట: పట్టణానికి చెందిన కొంపెల్లి విజయ(48), శ్రీరాముల ఐలయ్య(80) మృతి చెందగా, శనివారం పద్మశాలి కుల బంధువులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా విజయ, ఐలయ్య మృతదేహాలకు పద్మశాలి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్నె సర్వేశం, పట్టణ అధ్యక్షుడు రుద్ర ఓంప్రకాశ్, 13వ వార్డు కౌన్సిలర్ రుద్ర మల్లీశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కుటుంబాలను పరామర్శించిన వారిలో కూచన శ్రీనివాస్రావు, బంక రవీందర్, గడ్డం రాజేందర్, పర్ష శ్రీధర్, గాజుల రాము, వంగ రాజేందర్ పాల్గొన్నారు.
గీసుగొండ: మచ్చాపురం గ్రామానికి చెందిన కోల జనార్దన్ మృతి చెందగా, బాధిత కుటుంబానికి ఎంపీటీసీ కంబాల రజిత 25 కిలోల బియ్యం అందించారు. ఎలుకుర్తికి చెందిన బొల్లం చిన్ని కుమారస్వామి మృతి చెందాడు. అతడితో కలిసి చదువుకున్న స్నేహితులు మృతుడి పిల్లల పేర రూ. లక్ష బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. కార్యక్రమంలో కోటి, కరుణాకర్, రాజు, రమేశ్, రవీందర్, మోహన్రావు, రమేశ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
రంగనాయకసాగర్లో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
కొవిడ్-19 : మహారాష్ట్రలో సంపూర్ణ లాక్డౌన్కు కసరత్తు!