స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
మడికొండ, ఏప్రిల్ 6 : ప్రతి కార్మికుడికీ తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. రాంపూర్లో సూర్యతేజ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 150 మంది ఆటో కార్మికులకు కార్మిక శాఖ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. ప్రతి కార్మికుడికీ బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్మికుల బీమా ప్రీమియం చెల్లించిన రాంపూర్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ(యూఎస్ఏ) తక్కళ్లపల్లి అరవిందరావును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, ఆటో యూనియన్ నాయకులు బుస్స రాజు, చందరాజు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు రాంగోపాల్రావు, ఏర్పుల రాజు, అలువాల సురేశ్, విజయ్కుమార్రావు, దేవేందర్రావు, కుమార్, సదానందం, రమేశ్, సునీల్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చెత్త ట్రాక్టర్లో వెంటిలేటర్ల తరలింపు
ఓటు హక్కు వినియోగించుకున్న ‘మెట్రో మ్యాన్’