కరీమాబాద్, మే 3 : నగరంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు వరంగల్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం ఏకశిలానగర్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాం కును మెగా ఫ్యామిలీ రాష్ట్ర అధ్యక్షుడు కరాటే ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొవిడ్ బాధితులు ఆక్సిజన్ బ్యాం కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెగా కరాటే ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి ఆక్సిజన్ అందించి అండగా ఉండేందుకు చిరంజీవి చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిద్దం రాజు, నాయకులు వద్దిరాజు వెంకటేశ్వర్లు, బెడిదె వీరన్న, బొక్క నిరంజన్, సాంబయ్య, గాదె మధుసూదన్, వేనవంక కిరణ్, రాజుకుమార్, బొల్లోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. అత్యవసరంగా ఆక్సిజన్ కావాల్సిన వారు 9849009993, 9704242965, 98669 71651 సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.