గౌడ కులస్తులకే కాదు తెలంగాణకే గర్వకారణం
వెంకటాపురంలో గౌడ కమ్యూనిటీ హాల్, రూ.10కోట్లతో డబుల్ రోడ్డు
మంత్రి దయాకర్రావు
తొర్రూరు, ఏప్రిల్ 3: అన్యాయాన్ని ఎదిరించి గోల్కొండ కోటను ఏలిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ కులస్తులకే కాదు.. తెలంగాణకే ఆదర్శప్రాయుడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం రాత్రి ఆయన తొర్రూరు మండలం వెంకటాపురం గ్రా మంలో పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన కంఠమహేశ్వరస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్వా యి పాపన్న గౌడకులంలో పుట్టడం గర్వకారణమని, నాటి రాజుల కాలం లో అక్రమ పన్ను వసూళ్లకు వ్యతిరేకంగా పేదల పక్షాన నిలిచి పోరాటా లు చేశాడని అన్నారు. వెంకటాపురం గ్రామంలో గౌడ కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మం జూరు చేస్తానని హామీ ఇచ్చారు. రూ.10కోట్లతో వెంకటాపురం, శివారు తండాలను కలుపుతూ హరిపిరాల రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించే పనులు ప్రారంభిస్తామన్నారు.
నలమాస వెంకటయ్య, వీరయ్య స్మారకార్థం జయశ్రీ-శోభన్ దంపతులు పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి మొగుళ్ల వెంకటేశ్వర్లు చేయూతనందించడం అభినందనీయమన్నారు. వీరి స్ఫూర్తితో మరికొంతమంది గ్రామాభివృద్ధికి ముం దుకు రావాలని కోరారు. సీఎం కేసీఆర్ చలువతో ఇం టింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నదని, 24గంటల ఉచిత విద్యుత్తో వ్యవసాయ రంగం బలోపేతమైందన్నారు. అనంతరం కంఠమహేశ్వరస్వామి ఆలయంలో గౌడ కులస్తులతో కలిసి పూజలు చేశారు. మహిళలు బొడ్రాయి నుం చి ఆలయం వరకు బోనాలతో తరలివచ్చి స్వా మివారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శీలం లింగన్నగౌడ్, గౌడ కులసంఘం అధ్యక్షుడు నిమ్మల సాయిలు, శీలం వెంకన్న, గాదగాని సోమనర్సయ్య, ముత్యం వెంకన్న, కొండ శ్రీను, నిమ్మల వెంక న్న, నలమాస శోభన్, మొగుళ్ల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శీలం సుమంత్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక