డీఎంహెచ్వోలు అప్పయ్య, సుధార్సింగ్
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్
ములుగురూరల్, ఏప్రిల్ 2 : జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ దవాఖానల్లో శుక్రవారం 847 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 45 సంవత్సరాలు పైబడిన వారికి ఉచితంగా టీకా వేస్తున్నట్లు తెలిపారు. నెలాఖరు వరకు టీకా వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భూపాలపల్లిరూరల్, ఏప్రిల్ 2 : జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో 176 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేసినట్లు డీఎంహెచ్వో జే సుధార్సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూపాలపల్లి, గణపూర్, చెల్పూర్, మొగుళ్లపల్లి, ఒడితల, తాడిచర్ల పీహెచ్సీలు, మహాదేవ్పూర్, సింగరేణి ఏరియా సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న 111 మందికి, 60 సంవ త్సరాలు పై బడిన 65 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
వెంకటాపురం(నూగూరు) ఏప్రిల్ 2 : మండల కేంద్రం లోని ప్రభుత్వవైద్యశాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొన సాగుతున్నాయి. ప్రభుత్వ వైద్యాధికారి అల్లి నరేశ్ మాట్లాడు తూ.. లక్షణాలు ఉన్న వారు పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు.
మల్హర్, ఏప్రిల్ 2 : కరోనా వైరస్ రెండో దశ వ్యాపిస్తున్న నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 45 సంవత్సరాలకు పైబడిన వారు కరోనా వ్యాక్సిన్ వేయించు కోవాలని మండల వైద్యాధికారి గోపీనాథ్ అన్నారు. మండల కేంద్రంలో వైద్య సిబ్బందితో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్పై అన్ని గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్క రూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీకాంత్, సూపర్వైజర్లు పద్మ, సాజిత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
టీకా రెండు డోసులు తీసుకున్న పోలీస్ అధికారికి కరోనా
ఆస్ట్రేలియన్తో వృద్ధుడి లవ్ స్టోరీ! సోషల్ మీడియాలో వైరల్!!