ఎమ్మెల్యే అరూరి రమేశ్
102 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత
ఐనవోలు, మే 31 : సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధిని సాధించిందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఎంపీపీ మధుమతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని 102 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 14 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం వరమన్నారు. ఆడబిడ్డ పుడితే గతంలో తల్లిదండ్రులు కొంత ఆందోళన చెందేవారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ చొరవతో పరిస్థితులు మారాయన్నారు. కరోనా కష్టకాలంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపకుండా కొనసాగిస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటేనన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, తహసీల్దార్ రాజేశ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, ఐనవోలు దేవస్థాన చైర్మన్ సంపత్కుమార్, నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దేవేందర్, సర్పంచ్ కుమారస్వామి, ఉపసర్పంచ్ సతీశ్కుమార్, ఎంపీటీసీలు కల్పనామధుకర్, మండల అధ్యక్షుడు శంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు.