జడ్పీ సీఈవో శోభారాణి
గణపురం, మే 18 : నర్సరీల్లోని మొక్కలను రక్షించుకోవాలని జడ్పీ సీఈవో శోభారాణి అన్నారు. మండలంలోని కర్కపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని మంగళవారం జడ్పీ సీఈవో పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వేసవికాలంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనంలోని మొక్కలను రక్షించుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న బ్లాకుల్లో కొత్త మొక్కలు పెంచాలన్నారు. నిత్యం నీరందించాలని గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లెంకల అరుంధతి, మండల పంచాయతీ అధికారి రామకృష్ణ, ఏపీవో రాజయ్య, సర్పంచ్ పోట్ల నగేశ్ తదితరులు పాల్గొన్నారు.