భూపాలపల్లి టౌన్, మే 18 : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫకీర్గడ్డకు చెందిన మహిళా సంఘాల సభ్యులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ కొవిడ్ సెంటర్లను పెంచడం, భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర 30 ఆక్సిజన్ పడకల కొవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మార్గదర్శిని మహిళా సంఘం అధ్యక్షురాలు కోల మంజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేమ, పైడిపాల దీపిక, ఊట్ల కావ్య, శ్రీదేవి, రాజమ్మ, భద్రమ్మ, లచ్చమ్మ, కోల రాజమల్లు, దేవర ముత్తు తదితరులు పాల్గొన్నారు.