భూపాలపల్లిలో ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర
కొవిడ్ బారిన పడ్డ పిల్లల కోసం సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
కొవిడ్ బారినపడిన పిల్లల సంరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. వైరస్ బారిన పడిన పిల్లలను ఇంటి నుంచి సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు ట్రాన్సిట్ వాహనాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 30 ఆక్సిజన్ పడకల కొవిడ్ సెంటర్ను అవసరమైతే 50 పడకలు చేస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలున్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూపాలపల్లిలో నిర్మించిన వైద్యశాలను త్వరలోనే ప్రారంభిస్తామని, ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడినట్లు చెప్పారు.