పది దాటిందంటే గడపదాటని జనం
నిర్మానుష్యంగా రోడ్లు
నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసుల జరిమానాలు
నర్సంపేట, మే 17 : లాక్డౌన్ నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు సోమవారం జరిమానా విధించారు. అయ్యప్ప ఆలయం ఎదురుగా ఉన్న చెక్పోస్టు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే పంపించారు. అత్యవసర పనులకు వెళ్లే వాహనాలకు తప్పనిసరిగా పాస్లు ఉండాలని పోలీసులు తేల్చిచెప్పారు. రైతులు ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించారు.
చెన్నారావుపేటలో 21 మందికి జరిమానా
చెన్నారావుపేట : మండలంలో లాక్డౌన్ నిబంధనలను ఎస్సై శీలం రవి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అమలు చేస్తున్నారు. సోమవారం నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిపైకి వచ్చిన 21 మంది వాహనదారులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఎస్సై వెంట కానిస్టేబుళ్లు తిరుపతి, ఉపేందర్, రామకృష్ణ, క్రాంతికుమార్ ఉన్నారు.
పరకాలలో..
పరకాల : పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో సీఐ పింగిళి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపైకి వచ్చిన పలువురికి జరిమానాలు విధించారు.
దామెరలో..
దామెర : కరోనా నివారణకు పోలీసుశాఖ తగిన చర్యలు తీసుకుంటూ కృషి చేస్తున్నదని శాయంపేట సీఐ రమేశ్కుమార్ అన్నారు. సోమవారం దామెర మండలంలోని ఊరుగొండ, దుర్గంపేట, ఒగ్లాపూర్, దామెర-కొత్తపేట క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టి అవసరం లేకున్నా ద్విచక్రవాహనాలపై తిరుగుతున్న వారికి జరిమానా విధించారు. ఆయన వెంట ఎస్సై భాస్కర్ రెడ్డి, ట్రైనీ ఎస్సై, కానిస్టేబుళ్లు ఉన్నారు.
శాయంపేటలో..
శాయంపేట : మండలంలో సీఐ తోగిటి రమేశ్కుమార్, ఎస్సై అకినపెల్లి ప్రవీణ్కుమార్ నిత్యం లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్కు సహకరిస్తుండటంతో ఆరవ రోజు ప్రశాంతంగా జరిగింది.