కేయూ క్వారంటైన్ సెంటర్లో సకల సౌకర్యాలు
ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
భీమారం, మే17 : కరోనా బాధితులకు తెలంగాణ ప్రభుత్వ అండగా ఉందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. కరోనా బాధితులకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. వైరస్ బారిన పడి ఇంట్లో ఉండే పరిస్థితిలేక ఇబ్బం దిపడుతున్న వారు క్వారంటైన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆక్సిజన్ సరఫరా, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందు లున్నప్పటికీ ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అనంతరం ఆయన క్వారంటైన్లో ఉన్న కరోనా బాధితులకు డ్రై ఫ్రూట్స్, సామగ్రి అందజేశారు.