గణపురం/ మొగుళ్లపల్లి/ వెంకటాపూర్, మార్చి 16 : పల్లెల్లో స్థితిగతులను అధ్యయనం చేసేందుకు శిక్షణలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని చిట్యాల, గణపురం, మొగుళ్లపల్లి, వెంకటాపూర్ మండలాల్లో యువ అధికారులు మంగళవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు శాఖల అధికారులతో సమీక్షలు, పంటల పరిశీలన, పాఠశాలను సందర్శించారు. చిట్యాల మండలం నవాబుపేటలో సెర్ప్, ఐసీడీఎస్, ఎడ్యుకేషన్ ప్రభుత్వ శాఖల అధికారులతో విడి విడిగా సమీక్ష నిర్వహించారు. ట్రైనీ అధికారులు మీట్ మక్వానా, మిలీశ్శర్మ, అఖిల్థంపీ, రౌనక్ అగర్వాల్ మొదట మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వారి రికార్డులు, పొదుపు, జమ ఖాతాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లను సర్పంచ్ కసిరెడ్డి సాయిసుధతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, పిల్లలకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని టీచర్లను అడిగితెలుసుకున్నా రు. ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సం ఖ్య, మధ్యాహ్న భోజన వివరాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రైనీ అధికారు లు మాట్లాడుతూ గ్రామంలో మహిళా సంఘాల ఐక్యత బాగుందన్నారు. అంగన్వాడీ సెంటర్లో ఐసీడీఎస్ ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారం బాగుందని, కానీ, పిల్లలకు అంగాన్వాడీ బిల్డింగ్, స్వచ్ఛమైన నీరు అందడం లేదని తమ ద్వారా జిల్లా పరిపానాధికారికి తెలియజేస్తామన్నారు. పాఠశాల విద్యుర్థుల సంఖ్య మెరుగ్గా ఉందని, కొవిడ్ నిబంధనల వల్లే మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని తెలిపారు. వారి వెంట తహసీల్దార్ వై రామరావు, సీడీపీవో అవంతి, ఏపీఎం మంజూల, ఆర్ఐ నరేందర్, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘ సభ్యులు ఉన్నారు.
గణపురం మండలంలోని బుద్దారం జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం నలుగురు ట్రైనీ అధికారులు సందర్శించారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా భోదిస్తున్నారనే అనే విషయాన్ని పరిశీలించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై అధికారులు మాట్లాడారు. అ నంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వారివెంట తహసీల్దార్ పాలకుర్తి మాధవి, ఎంపీడీవో లెంకల అరుంధతి, డీఆర్డీవో పురుషోత్తం, ఎంపీవో రామకృష్ణ, వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, పం చాయతీ కార్యదర్శి నవీన్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్లలో వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న, పల్లి పంటలను ట్రైనీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ఏ పంటకు ఎంత పెట్టుబడి అవుతుంది? దిగుబడి ఎంత వస్తుందని వివరాలు తెలుసుకు న్నారు. అనంతరం పాఠశాలలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సమ్మయ్య, ఏవో సురేందర్రెడ్డి, సర్పంచ్ నైనకంటి ప్రభాకర్రెడ్డి, ఎంపీటీసీ దండ వెంకటేశ్వర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
వెంకటాపూర్ మండలంలోని నర్సాపూర్లో ట్రైనీ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు రాజర్శి రాజ్ వర్మ, షైఫా లీ బర్వల్, శుభమ్ సింగ్, అశోక్ బదనే, ఏఎస్పీ సాయి చైతన్య పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కాకతీయ శివాలయాన్ని సందర్శించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన సమావేశంలో గ్రామంలోని స్థితిగతులపై అధ్యయనం చేశారు. వారి వెంట తహసీల్దార్ మంజుల ఉన్నారు.