మొక్కల మధ్య నీళ్లు నిల్వకుండా చూడాలి
నర్సంపేట ఏపీడీ సాయిచరణ్
రాయపర్తి, జూన్ 16: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నేతృత్వంలో చేపట్టబోయే హరితహారం కార్యక్రమానికి జీపీ పాలకవర్గాలు సన్నద్ధం కావాలని నర్సంపేట ఏపీడీ సాయిచరణ్ సూచించారు. మండలంలోని రాయపర్తి, రాగన్నగూడెం, పెర్కవేడులోని పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలను బుధవారం ఆయన ఎంపీవో తుల రామ్మోహన్, ఏపీవో దొణికెల కుమార్గౌడ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మండలంలో నాటాల్సిన మొక్కల లక్ష్యం, పెంచాల్సిన విధానాలపై సర్పంచ్లు, వన సేవకులు, ఈజీఎస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు పెంచుతున్న స్థలాల్లో నీళ్లు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. మొక్కల చుట్టూ కలుపుతీత పనులు చేయాలన్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు రెంటాల గోవర్ధన్రెడ్డి, చిన్నాల తారాశ్రీ రాజబాబు, కార్యదర్శులు గుగులోత్ అశోక్నాయక్, లక్ష్మి, కారోబార్లు కారుపోతుల రాంచంద్రయ్య, సరికొండ సంతోష్కుమార్, గారె ఉపేందర్ పాల్గొన్నారు.
రాయపర్తి పార్కుకు ఏపీడీ కితాబు
మండలకేంద్రంలోని రాయపర్తి-అన్నారం షరీఫ్రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో గ్రామ పంచాయతీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాన్ని చూసిన ఏపీడీ సాయిచరణ్ సర్పంచ్ గారె నర్సయ్యను అభినంధించారు. పార్కు నిర్వహణ బాగుందని, పల్లెప్రకృతి వనంలో మొక్కల పెంపకంపై జీపీ, ఈజీఎస్ సిబ్బంది తీసుకుంటున్న చర్యలు భేష్ అని కితాబిచ్చారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయన్నారు. ఆయన వెంట ఈజీఎస్ ఉద్యోగులు ఉన్నారు.