సీపీ తరుణ్జోషి
మడికొండ, జూన్ 5 : శాంతి భద్రతలతోపాటు ప్రజల ఆరోగ్య రక్షణ తమ బాధ్యత అని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి అన్నారు. ధర్మసాగర్ పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఏరియాలో వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్త్క్యాంపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. వలస కార్మికులు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తి వైద్య సహకారం అందిస్తామని తెలిపారు. సుమారు 200 మంది కార్మికులకు కరోనా పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్, జిల్లా వైద్యశాఖ ప్రతినిధి డాక్టర్ కృష్ణారావు, ధర్మసాగర్, మడికొండ ఇన్స్పెక్టర్లు రమేశ్కుమార్, రవికుమార్, ఎస్సై నర్సింహారావు, పీహెచ్సీ వైద్యాధికారి శైలజ పాల్గొన్నారు.