నర్సంపేట/నర్సంపేటరూరల్/శాయంపేట/ఖానాపురం/నెక్కొండ/చెన్నారావుపేట/ఆత్మకూరు, మే 5: ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న కరోనా టీకాలను వినియోగించుకోవాలని నర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ పీ గోపాల్ కోరారు. బుధవారం ఆయన పట్టణంలో వ్యాక్సినేషన్ను పరిశీలించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించారు. నర్సంపేటలో 30 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వంద మందికి వ్యాక్సిన్ వేశారు. అలాగే, 91 మందికి కరోనా పరీక్షలు చేయగా, 50 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మండలంలోని భాంజీపేట పీహెచ్సీలో పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్ ఆధ్వర్యంలో అర్హులకు వ్యాక్సిన్ వేస్తున్నారు. బుధవారం రిటైర్డ్ తహసీల్దార్ సురేందర్ టీకా వేసుకున్నారు. శాయంపేటలో 25 మందికి పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి నాగశశికాంత్ తెలిపారు. 83 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. నల్లబెల్లి పీహెచ్సీలో 76 మందికి టీకాలు వేశారు. 36 మందికి పరీక్షలు చేయగా, 14 మందికి పాజిటివ్ వచ్చింది. మేడపల్లి పీహెచ్సీలో 100 మందికి వ్యాక్సిన్ వేశారు. 34 మందికి టెస్టులు చేయగా, ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఖానాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 110 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి మల్యాల అరుణ్కుమార్ తెలిపారు. నెక్కొండ పీహెచ్సీలో 25 మందికి పరీక్షలు చేయగా, 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి రమేశ్ తెలిపారు. 68 మందికి వ్యాక్సిన్ చేసినట్లు తెలిపారు. అలంకానిపేట పీహెచ్సీలో 31 మందికి పరీక్షలు చేయగా, 22 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి సుమంత్ తెలిపారు. 55 మందికి టీకాలు వేశామన్నారు. చెన్నారావుపేటలో 102 మందికి వ్యాక్సిన్ వేశామని వైద్యాధికారి రాజు తెలిపారు. 36 మందికి పరీక్షలు చేయగా, ఆరుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఆత్మకూరు పీహెచ్సీలో 63 మందికి టెస్టులు చేయగా 19 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి రణధీర్ తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు.