ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
కరీమాబాద్, జూన్ 4 : కల్యాణలక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. శుక్రవారం పెరుకవాడలోని ఎమ్మెల్యే నివాసంలో 22వ డివిజన్కు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదలకు ఎంతగానో ఉప యోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయభాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే 32వ డివిజన్లో కార్పొరేటర్ పల్లం పద్మ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్తోటలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కత్తెరశాల వేణుగోపాల్, పల్లం రవి, నాయకులు నాగపురి సంజయ్బా బు, మండ శ్యాం, కొండ రాజు, రాముల బాబు, ఆడెపు భిక్షపతి, నరిగె శ్రీను, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే రాజయ్య
మడికొండ: సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. 46వ డివిజన్ రాంపూర్లో శుక్రవారం ఆయ న 14 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మునిగాల సరోజన అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో కూడా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు తక్కళ్లపల్లి ప్రభాకర్రావు, అర్షనపల్లి విజయ్కుమార్రావు, దేవేందర్రావు, రాజు, పిట్టల రమేశ్, చందరాజు సునీల్, చెన్నూరి రవీందర్, సదానందం, మునిగాల శ్రీకాంత్, బండి వెంకన్న, మాదాసి రమేశ్, కడారి కుమార్, యాదగిరి, చంద్రమౌళి పాల్గొన్నారు.