ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
వరంగల్ సీపీ తరుణ్జోషి
కమలాపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ
కమలాపూర్ మే4: పోలీసులు విధుల్లో నిర్ల క్ష్యం చేస్తే చర్యలు తప్పవని వరంగల్ సీపీ తరు ణ్జోషి హెచ్చరించారు. మంగళవారం కమలా పూర్ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అ న్నారు. నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించా రు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంత రం పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్ను పరిశీలిం చి, ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారో సిబ్బం దిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో నే రాల నియంత్రణతోపాటు రోడ్డు ప్రమాదాల నివా రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఏసీ పీ రవీంద్రకుమార్ను అడిగారు. ప్రజలకు మెరుగై న సేవలు అందించి వారి మన్ననలను పొందాల ని పోలీస్ సిబ్బందికి సూచించారు. పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచేలా విధులు నిర్వర్తించా లని సూచించారు. పోలీస్ స్టేషన్ను భవనాన్ని పరి శీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట వరంగల్ సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీపీ పుష్ప, కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్, ఇన్చార్జి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై పరమేశ్వర్ ఉన్నారు.