జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీకి ఎగువ నుంచి వరద కొనసాగుతున్నది. దీంతో ఈ ఉదయం అధికారులు బ్యారేజీ 15 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి దాదాపు 53 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. బ్యారేజీ 15 గేట్లను ఎత్తి 31,100 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. లక్ష్మి (కన్నెపల్లి) పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి 4,200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.