జయశంకర్ భూపాలపల్లి : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జిల్లాలో పలుచోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా, సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రేగొండ మండలం చెన్నపూర్ గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఎవరు కూడా అధైర్య పడొద్దాన్నారు. టీఆర్ఎస్ రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు. సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.
రైతులను రాజును చేయడమే సీఎం ధ్యేయమన్నారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి రైతులకు తగిన న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.