భూపాలపల్లి: గతంలో గంజాయి కేసులో పట్టుబడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని భూపాలపల్లి సీఐ వాసుదేవరావు తెలిపారు. మహముత్తారం మండలం గండికామారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాదం భిక్షపతి (36), గోగు రంజీత్ (26), భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కొమ్మిరెడ్డి దేవేందర్ రెడ్డి( 28), గాజే స్వామి (28)లపై షీటు ఓపెన్ చేసి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇక నుంచి ఎవరైనా గంజాయి సాగు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా, సేవించినా వారిపై కేసులు నమోదు చేసి, షీటు ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. యువత గంజాయికి బానిసలై బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని భూపాలపల్లి సీఐ వాసుదేవరావు తెలిపారు.