జయశంకర్ భూపాలపల్లి : కొవిడ్-19 పాజిటివ్గా తేలిన గ్రామస్తులు ఊరికి సమీపంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని తమ ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యత్నారం గ్రామంలో చోటుచేసుకుంది. కొవిడ్ పాజిటివ్కు గురైన దాదాపు 20 మంది గ్రామవాసులు గత మూడు రోజులుగా అటవీ ప్రాంతంలోనే ఐసోలేషన్లో ఉన్నారు.
వైరస్ బారిన గ్రామస్తులు ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లో ఉండేందుకు ఇష్టపడటం లేదు. దీంతో వారు తమకు తాముగా ఊరికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఐసోలేషన్ కేంద్రంగా చేసుకున్నారు. జిల్లా అధికారులు అనేక అభ్యర్థనలు చేసినప్పటికీ వారు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. చివరికి వారిని ఒప్పించి గురువారం స్థానిక ప్రాథమిక పాఠశాలకు మార్చినట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య చెప్పారు.