Bhupalpally : కాటారం : వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీరామ్ అన్నారు. కాటారం పీహెచ్సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ వైద్య సిబ్బంది పక్కాగా సర్వే నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. అనంతరం కరోనా వ్యాక్సినేషన్ నేషనల్ ప్రోగ్రాంల అమలు తీరు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. రామారావు, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. గోపినాథ్, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.