జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంపై బుధవారం మంచుదుప్పటి పరుచుకుంది. తెల్లవారుజామున మంచుపొరల్లో దారులు మూసుకుపోయాయి. పట్టణంలో ఎటుచూసినా పొగమంచే కనిపించింది. పిల్లలు, పెద్దలు పొగమంచులోనే వాకింగ్ చేయడం కనిపించింది. ఉదయం 7:30 గంటలకు సైతం మంచు అలాగే ఉంది.