జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టింది
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకున్న ఎమ్మెల్యే
కృష్ణకాలనీ, మే 25 : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని, జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో డోస్ వ్యాక్సిన్ను ఎమ్మెల్యే వేసుకుని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక నుంచి రోజూ భూపాలపల్లి పీహెచ్సీలో 100 మందికి తగ్గకుండా కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మొదటి వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేయించుకుని, రెండో డోస్ వేయించుకోవాలన్నారు. ప్రజలందరూ కరోనాపై అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు. జిల్లాలో లాక్డౌన్ ఉన్నప్పటికీ కొంత మంది ప్రజలు రోడ్లపై తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికైనా అధికారులకు సహకరించాలని కోరారు. అనంతరం పీహెచ్సీలోని వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీఆర్ఎస్ భూపాలపల్లి టౌన్ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, కౌన్సిలర్లు పానుగంటి హారిక, శిరుప అనిల్, ముంజాల రవీందర్, ఎడ్ల మౌనిక, జక్కం రవికుమార్, నూనె రాజు, ఆకుదారి మమత, ముంజంపల్లి మురళీధర్, నాగుల శిరీషారెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్రెడ్డి, యూత్ టౌన్ అధ్యక్షుడు బుర్ర రాజు, టీఆర్ఎస్ నాయకులు బుర్ర రమేశ్, కరాటే శ్రీనివాస్, పానుగంటి శ్రీనివాస్, జాగృతి నాయకులు చీకటి గణేశ్, పీహెచ్సీ వైద్యులు డాక్టర్ రవికుమార్, జ్యోతి, సీహెచ్వో రాజయ్య, సూపర్వైజర్ సీతల్ సింగ్ పాల్గొన్నారు.
జర్నలిస్టులకు అండగా ఉంటా
ఆపదలో ఉన్న జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో 100 మంది జర్నలిస్టులకు ఎమ్మెల్యే 25కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తన వంతు సాయం చేసినట్లు