పాజిటివ్ వ్యక్తికి వైద్యం అందించేందుకు సులువుగా ఉంటుంది
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
కృష్ణకాలనీ, మే 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫీవర్ సర్వేతో కరోనా వైరస్ను పూర్తిగా నియంత్రించవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో ఆయన పాల్గొని ప్రజల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాలామంది కొవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ బయట తిరుగుతున్నారని, అలాంటి వారిని గుర్తించి వైద్యం అందించేందుకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఫీవర్ సర్వే చేసేందుకు 30 బృందాలను ఏర్పాటు చేశామని, ప్రతి వార్డులో ప్రతి ఇంటికి వచ్చి సర్వే చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీఆర్ఎస్ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, కౌన్సిలర్లు, పానుగంటి హారిక, శిరుప అనిల్, ముంజాల రవీందర్, ఎడ్ల మౌనిక, జక్కం రవికుమార్, నూనే రాజు, ఆకుదారి మమత, ముంజంపెల్లి మురళీధర్, నాగుల శిరిషారెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు తిరుపతి, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హరీశ్రెడ్డి, యూత్ టౌన్ అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ నాయకులు రమేశ్, కే శ్రీనివాస్, పీ శ్రీనివాస్, జాగృతి నాయకులు గణేశ్, డీఎంహెచ్వో డాక్టర్ సుధార్సింగ్, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ ఇక్బాల్, పీహెచ్సీ వైద్యులు రవికుమార్, జ్యోతి, సీహెచ్వో రాజయ్య, సూపర్వైజర్ సీతల్ సింగ్ పాల్గొన్నారు.