భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తొమ్మిది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీజీసీఆర్టీ, సీఆర్టీ పోస్టులకు తాత్కాలిక ప్రాతి పదికన పని చేసేందుకు అర్హత గల మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పీజీసీఆర్టీ -52, సీఆర్టీ-11 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పీజీసీఆర్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడీ కలిగి ఉండాలని, సీఆర్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు డిగ్రీతో పాటు బీఈడీ కలిగి ఉండాలని తెలిపారు.
దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వారై ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులను కేజీబీవీ ప్రత్యేక అధికారికి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందజేయాలని సూచించారు. అదనపు సమాచారం కోసం బాలికల విద్యాభివృద్ధి అధికారి ఎం.శివరంజని 9010443773 నెంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.