భూపాలపల్లి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-2022 విద్యాసంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కో-ఆర్డినేటర్ డాక్టర్ గౌరీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 25వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని, ఇంటర్ ఉత్తీర్ణత పొందిన, ఐటీఐ, ఓపెన్ ఇంటర్ పూర్తి చేసిన వారు, డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో, డిగ్రీ పూర్తి చేసిన వారు పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.