భూపాలపల్లి రూరల్, మే 29: లాక్డౌన్ సమయంలో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు చాలా గొప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. శనివారం సింగరేణి ఇల్లందు క్లబ్హౌస్లో ఏఎంఆర్ కంపెనీ వారి సహకారంతో జిల్లాలోని జర్నలిస్టులకు కలెక్టర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరో నా సమయంలో కూడా జర్నలిస్టులు నిత్యం వార్తలను సేకరిస్తూ, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు కొంతైనా ఆసరా కల్పించాలనే ఉద్దేశం తో తాడిచర్ల బొగ్గు బ్లాక్ ఏఎంఆర్ కంపె నీ వారి సహకారంతో బియ్యం, పప్పు లు, వంట నూనె, సబ్బులు, ఉప్పు, కా రం, తదితర నిత్యావసర సరుకులను అందజేస్తున్నట్లు చెప్పారు. సూపర్ స్ప్రె డర్ కేటగిరీలో గుర్తింపు పొందిన జర్నలిస్టులతో పాటు ఇతరులకు కూడా ప్రభుత్వ సూచనల మేరకు కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నామని తెలిపారు. లాక్డౌన్ సమయంలో వార్తల సేకరణకు బయటకు వచ్చే జర్నలిస్టులకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక కార్డులను అందించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలను వ్యక్తిగతంగా ప్రతి జర్నలిస్టూ పాటించాలని కోరారు. కార్యక్రమంలో డీపీఆర్వో బీ రవికుమార్, ఏఎంఆర్ కంపెనీ పీఆర్వో వెంకట్, జర్నలిస్టులు, సిబ్బంది పాల్గొన్నారు.