జాతీయ దివ్యాంగుల ముగింపు క్రికెట్ పోటీల్లో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్భాస్కర్
విజేతగా నిలిచిన తెలంగాణ జట్టు
హనుమకొండ, డిసెంబర్ 28 : వీల్చైర్ క్రికెట్ క్రీడాకారులను (దివ్యాంగులను) స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ దివ్యాంగుల క్రికెట్ పోటీలు మంగళవారం ముగిశాయి. తెలంగాణ జట్టు 15 ఓవర్లలో 197 పరుగులు చేయగా, రాజస్థాన్ జట్టు 96 పరుగులు చేసింది. దీంతో తెలంగాణ జట్టు విన్నర్గా నిలిచి కప్ గెలుచుకుంది. గెలుపొందిన జట్టుకు విజయ్భాస్కర్ చేతుల మీదుగా కప్, క్రికెట్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా విజయ్భాస్కర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ పోటీల్లో తెలంగాణ జట్టు విజయం సాధించి తెలంగాణ పేరు ప్రఖ్యాతులను నిలబెట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారన్నారు. హనుమకొండ క్రీడా రంగానికి ఒక వేదికైందని వివరించారు. గెలుపొందిన జట్టుకు ఈ సందర్భంగా రూ.10వేలు, రన్నర్ టీంకు రూ.5వేల నగదు బహుమతి సైతం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్ నెక్కొండ కవిత, సీడబ్ల్యూసీ మాజీ చైర్పర్సన్ అనితారెడ్డి, రోటరీ క్లబ్ ప్రతినిధులు, దివ్యాంగుల వీల్చైర్ క్రికెట్ కెప్టెన్ శ్రీధర్, భరత్, పారూర్, టీఆర్ఎస్ 50వ డివిజన్ అధ్యక్షుడు కోటేశ్వర్రావు, తెలంగాణ జాగృతి దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు లింగుదారి రాజేశ్వర్రావు, నడిపల్లి శ్రీధర్రావు, రామస్వామి, ఖాజా, నవీన్ తదితరులు పాల్గొన్నారు