భూపాలపల్లి రూరల్, నవంబర్ 26 : భారతదేశ అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జేసీ స్వర్ణలత, అదనపు కలెక్టర్ టీఎస్ దివాకరతో పాటు పలు శాఖల అధికారులు, సిబ్బందితో కలి సి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం అమలుతో దేశ ప్రజలు స్వేచ్ఛ, సమానత్వాన్ని పొందుతున్నారని తెలిపారు. రాజ్యాంగం స్ఫూర్తితో ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలని తెలిపారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశికను చదివారు. కార్యక్రమంలో డీపీవో ఆశాలత, డీఆర్డీవో పురుషోత్తం, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు రవి కుమార్, శ్రీనివాస్, గౌస్, రవి కిరణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దేశంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం
ములుగుటౌన్: దేశంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాం గం భారతదేశానిదని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యంగాన్ని ఆమోదించి 72 సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు. రాజ్యాంగం కల్పించిన స్ఫూర్తితో పేదల అభివృద్ధికి అధికార యం త్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. అనతరం అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రవేశికను చదివించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్వో మాదేవి, ములుగు ఏఎస్పీ సాయిచైతన్య, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, కలెక్టరేట్ ఏవో, సూపరింటెండెంట్ శ్యామ్, రాజ ప్రకాశ్, సిబ్బంది పాల్గొన్నారు.