రాజ్యాంగంలోని హక్కులను అవగాహన చేసుకోవాలి
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 26 : రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలు అవగాహన చేసుకోవాలని కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని శివునిపల్లిలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి నేతృత్వంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి రాజయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. నిమ్నవర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తమ హక్కులను రాజ్యాంగం ద్వారా పొందగలుగుతున్నారని ఆయన అన్నారు. న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, దేశంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలనే విషయాలను రాజ్యాంగంలో పొందుపర్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్ ఎంపీపీలు కందుల రేఖాగట్టయ్య, రడపాక సుదర్శన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తాటికొండ సురేశ్, ఎంపీడీవో , గ్రామ ప్రత్యేకాధికారి కుమారస్వామి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మమత, స్వాతిరెడ్డి, గోలి కవిత, రఘునాథపల్లి మండల కార్యదర్శి రమ్య, స్టేషన్ ఘన్పూర్ మండల ఇన్చార్జి బొల్లు లక్ష్మి, పీఏసీఎస్ డైరెక్టర్ తోట సత్యం, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు లాకావత్ చిరంజీవి, టీఆర్ఎస్ మండల కార్యదర్శి వారణాసి రామకృష్ణ, గ్రామశాఖ అధ్యక్షుడు బైరి బాలరాజు, నర్సింహ, ఎంపీటీసీలు బూర్ల లతాశంకర్, గుర్రం రాజు, సింగపురం దయాకర్, అంబేడ్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు గుర్రం శంకర్, మార్కెట్ డైరెక్టర్లు జొన్నల సోమేశ్వర్, చిగురు సరిత, పంచాయతీ కార్యదర్శి వెంకటకిశోర్, గుండె మల్లేశ్, మారపెల్లి ప్రసాద్, అకారపు అశోక్ పాల్గొన్నారు.