భూపాలపల్లి టౌన్, జూలై 26 : జిల్లా కేంద్రంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి బస్టాండ్ సమీపంలో రూ.15 లక్షలతో వీధి వ్యాపారుల జోన్ (వ్యాపార సముదాయ గదులు)కు, సుభాష్ కాలనీలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, సీఆర్నగర్లో రూ.12 లక్షలతో ఈద్గా ప్రహరీ నిర్మాణం, రూ.9 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, ఎంపీపీ మందల లావణ్య, జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డీఎంసీ రాజేశ్వరి, కో ఆర్డినేటర్ నిర్మల, టీఆర్ఎస్ అర్బన్, మండల అధ్యక్షులు క్యాతరాజు సాంబమూర్తి, మందల రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు ముంజంపల్లి మురళి, పిల్లలమర్రి శారద, పార్టీ సీనియర్ నాయకులు బుర్ర రమేశ్, తాటి అశోక్, నాగుల రాజిరెడ్డి, చాట్ల రాములు, వార్డు కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.