భూపాలపల్లి రూరల్, జూలై 23: అవయవ దానానికి ముందుకు రావాలని జీవనధాన్ రాష్ట్ర పీఆర్వో తాటి పవన్రెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని మిలీనియం క్వార్టర్స్లో నివసిస్తున్న అయిత హరీశ్(30) ఈనెల14న బ్రెయిన్ డెడ్ కాగా ఆయన కుటుంబ సభ్యులు జీవవ్ధాన్ సంస్థ ద్వారా గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం దానం చేసి ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించారు. శుక్రవారం హరీశ్ స్వగృహంలో తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. హరీశ్ కుటుంబ సభ్యులను సన్మానించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సతీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.